Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

అఖండ 2లో కొత్త ట్విస్ట్: హీరోయిన్ మార్పు సంచలనం

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న అఖండ 2 – తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం అఖండ మాదిరిగానే, ఈ సీక్వెల్ కూడా మాస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతోంది.

తాజాగా, చిత్రబృందం ఈ సినిమాలో నటించే కొత్త హీరోయిన్‌ గురించి ఆసక్తికర సమాచారం వెల్లడించింది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగంలో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్ స్థానంలో సంయుక్తను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా పాత్రకు మొదటి భాగంలో కీలక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, సీక్వెల్ కథలో కొత్త మలుపులు ఉండబోతున్నాయని సమాచారం.

అద్భుతమైన విజువల్స్, ఇంటర్వెల్ హైపో

ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కథలోని కీలక సన్నివేశాలను ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో చిత్రీకరించడం విశేషం. సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. “ఇంటర్వెల్‌కే మీ టికెట్ డబ్బులకు న్యాయం అవుతుంది,” అంటూ థమన్ వ్యాఖ్యానించడంతో, సినిమాపై అభిమానుల్లో ఆతృత మరింత పెరిగింది.

నూతనతతో కూడిన కథ

సీక్వెల్ కథ ప్రకారం, అఖండ 1లో చిన్న బాలయ్య పాత్ర ముగిసిన చోటినుంచి కథ కొనసాగుతుంది. పెద్ద బాలయ్య పాత్రలో కొత్త సవాళ్లు, మలుపులు, మరియు అఘోరా విశ్వరూపం మరింత పటిష్టంగా ఉంటుందని సమాచారం. అలాగే, సంయుక్త మీనన్ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా గోప్యంగా ఉంచినా, ఆమె పాత్ర సినిమాకు కీలకంగా ఉండబోతుందని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది.

మాస్ అండ్ క్లాస్ కలయిక

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ ఫ్రాంచైజ్‌కు సిక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *