సుకుమార్‌ శ్రీతేజ్‌ను పరామర్శించి కుటుంబానికి సాయం

సంధ్య థియేటర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ దర్శకుడు సుకుమార్‌ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సందర్శించిన సుకుమార్‌, బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాలుడి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.