లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్. రాజమౌళి, దిల్రాజు, త్రివిక్రమ్, ఎన్. శంకర్, రాధాకృష్ణ, సి. కల్యాణ్, సురేశ్బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేశ్, ప్రవీణ్బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు
